Connect with us

స్పెషల్ ఆర్టికల్స్

ఎన్నికలకు ఊరూరా భోజనాలు.. నేతల పరేషాన్..!

Published

on

  • ప్రతి రోజూప్రచారంలో  రూ.లక్షల్లో ‘వ్యయం ‘

న్యూస్ పల్స్ తెలుగు,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు, అభ్యర్థులకు వారి రోజువారీ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి..

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గ్రామాల నుంచి పట్టణాల దాకా ప్రతి రోజూ పెద్దసంఖ్యలో నాయకులు వారి కార్యకర్తలకు, వారి వెంట ఉండే వారికి సామూహిక భోజనాలు వండుతున్నారు. రోజూ వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించే వారికి వారి నాయకులే భోజనాలు సమకూరుస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామం,ప్రతి పట్టణంలో నిత్యం వేల మందికి భోజనాలు సిద్ధం చేసి వడ్డిస్తున్నారు.

ఈ భోజనాల కోసం హోటళ్లు, క్యాటరింగ్‌లు ,భోజనం సిద్ధం చెసే నిర్వాహకులు పెద్దఎత్తున సరకులు అన్ని కొని నిల్వ చేస్తున్నారు. క్రిందటి నెల క్రితం వరకూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి భారీగా ఉల్లిగడ్డలు,కూరగాయలు,  ఇతర సరకులు రాష్ట్రానికి వచ్చేవి. కానీ ఇప్పుడు మహారాష్ట్రకు ఉత్తరాన రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లో , తూర్పున ఛత్తీస్‌గఢ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తెలంగాణ రాష్ట్రంకు కూరగాయల సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా దాదాపు కర్ణాటక,ఆంధ్రప్రదేశ్‌ల నుంచే కూరగాయలు మరియు ఇతర వస్తువులు దిగుమతి అవ్వుతున్నాయి..

క్రిందటి నెల వరకూ సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని టోకు మార్కెట్‌కు రోజూ 21 వేల క్వింటాళ్లకు వరకు కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు దాదాపు సగానికి సగం దిగుమతి తగ్గిపోయినట్లు అక్కడి మార్కెట్ సిబ్బంది చెబుతున్నారు. ఇటు మరోవైపు జాతీయ మార్కెట్లలో కూడా నిత్యావసరాలకు గత నెలరోజులుగా ఎక్కువ శాతం డిమాండు ఏర్పడిందని టోకు మార్కెట్ వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా ఈసారి భోజనాలకే రోజూ లక్షల్లో వెచ్చించాల్సి వస్తోందని ప్రస్తుత అభ్యర్థులు వాపోతున్నారు. దీనికి తోడు ఇదే సమయంలో పెళ్లి ముహూర్తాలు,అయ్యప్పదీక్షలు ,కార్తికమాసం మొదలవుతుండటంతో, ప్రతి ఊరిలో అన్నదానాలతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఇలా అన్ని నిత్యావసరాలకు డిమాండ్‌ పెరగడంతో మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది.

Spread the love

Viral న్యూస్

Srirama Navami: శ్రీరామనవమి అస్సలు చరిత్ర ఇదే..

Published

on

News Pulse Telugu: (Sri Ramanavami History)

శ్రీ రామనవమి చరిత్ర చాలా పురాతనమైనది, దేశవ్యాప్తంగా హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ శ్రీరామ నవమి. ఇది భగవాన్ శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమిగా భావించబడుతుంది.చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిది తేదీన పున్నమి నక్షత్రం సమయంలో రాముడు జన్మించాడు.ప్రతియేట ఈ శ్రీరామ నవమిని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అస్సలు శ్రీ రామనవమి చరిత్ర…?

రాముడు త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు రాజ్యపాలన చేస్తున్న కాలంలో,దశరథ మహారాజు కు సంతానం లేకపోవడంతో యాగాలు చేస్తాడు. పుత్రకామేష్టి యాగం ఫలితంగా శ్రీమహావిష్ణువు నాలుగవ అవతారంగా రాముడిగా జన్మిస్తాడు.

దేవతలు రాక్షసుల అల్లర్ల వల్ల భూభారంగా వుండగా, విష్ణువును ప్రార్థించగా ఆయన రాముడిగా అవతరించాడని ఓ విశ్వాసం. రావణుని సంహారం కోసం ఈ అవతారం తీసుకున్నాడని పౌరాణిక విశ్వాసం.

శ్రీరామ నవమి పండుగ విధానం..?

శ్రీ రామ నవమి రోజు ఈ పండుగను పలుచోట్ల పలు రకాలుగా జరుపుకుంటారు, కొన్నిచోట్ల రాముడి జన్మకథ వినడం, రామాయణ పారాయణం చేస్తారు. ఎక్కువ శాతం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరాముని కళ్యాణోత్సవాలు(Sri Rama Kalyanam) అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ శ్రీరాముని కళ్యాణానికి భద్రాచలం చాలా ఫేమస్.
కొన్ని చోట్లల్లో ప్రజలు ఉపవాసం ఉంటారు, కొన్ని చోట్ల పానకమ్,జాగ్రతితో చేసిన తేనె లేదా బెల్లం నీరు, వడపప్పు, పులిహోర శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కనుక ఆలయాల్లో జరిగే కళ్యాణానికి హాజరై భక్తులందరికీ, చల్లటి మజ్జిగ, బెల్లం పానకం అందజేస్తారు.
శ్రీరాముని కళ్యాణోత్సవం ముగించిన తర్వాత, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథాలలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు.

శ్రీరామనవమి ఉత్సవ సందేశం..

ఈ పండుగ ధర్మం, సత్యం,నిజాయితీ, శాంతి, మర్యాదకు,నైతికతలను నెమలే రోజు అని చెబుతారు. శ్రీరాముని జీవితం హిందూ ధర్మంలో ఆదర్శంగా భావిస్తారు. శ్రీరాముడు తన జీవితంలో చూపిన విలువలు నేటికి ప్రజలు వారి జీవితాల్లో ఆదర్శంగా తీసుకుంటారు.
ఈ శ్రీరామనవమి ఉత్సవం కేవలం పండుగ కాకుండా, తెలుగువారి సంస్కృతిని మానవ విలువలను గుర్తుచేసే అద్భుతమైన పండుగని భావిస్తారు.

Tags: Sriramanavami, SitaRamachandraswamy, JaiSriram, NewspulseTelugu

Spread the love
Continue Reading

Viral న్యూస్

Chitti Pickels వివాదం ఏంటి..?

Published

on

News Pulse Telugu : Alekhyaa Chitti Pickles, ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం అవసరం లేదు, ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఎన్నో వివాదాలతో పేరు జోరుగా వినిపిస్తుంది.
అయితే ఈ విషయాన్ని, ఆ వివాదాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం…

Alekhyaa Chitti Pickles ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు అక్క చెల్లెలు కలిసి నిర్వహిస్తున్నారు. వారు వివిధ రకాల పికిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఈ యొక్క వ్యాపారానికి ముందు ఈ ముగ్గురు అక్క చెల్లెలు, సోషల్ మీడియా వేదికగా, ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లలో పలు వీడియోలను చిత్రీకరిస్తూ, మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.
యొక్క సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫేమ్ ని, వారి యొక్క వ్యాపారాన్ని ఉపయోగించుకుంటూ పచ్చళ్ల విక్రయాన్ని కొనసాగించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

అయితే, కొందరు వినియోగదారులు వారి నాణ్యత మరియు ధరల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మార్కెట్ ప్రకారం చూసుకున్న, మార్కెట్లో ఉన్న ధరలకు రెండింతలుగా వీరి యొక్క పికిల్స్ ధరలతో విక్రయస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
ఆ పికిల్స్ ని కొన్న వినియోగదారులు కూడా వారి యొక్క పికిల్స్ కు సంతృప్తి చెందడం లేదు, వారు నిర్ణయించిన ధరకు, పికిల్స్ రుచి, నాణ్యత అంతగా లేకపోవడం వినియోగదారులను తీవ్ర నిరాశకు తరచూ గురిచేస్తుందని చాలామంది వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా వారికి నేరుగా తెలుపుతున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో అలేఖ్య చిట్టి పికిల్స్‌కు సంబంధించిన కొన్ని వివాదాలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా నడుస్తున్నాయి.

అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క వివాదం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఆడియో క్లిప్‌ల చుట్టూ తిరుగుతోంది. ఈ క్లిప్‌లలో, అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థకు చెందిన వ్యక్తి కస్టమర్లతో దురుసుగా, అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆడియోలో కస్టమర్‌లతో సంస్థ ప్రతినిధులు మాట్లాడినట్లుగా ఉన్న అనేక ఆడియో క్లిప్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటిలో కొందరు కస్టమర్‌లు ధరల గురించి లేదా ఇతర సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు దురుసుగా సమాధానం చెప్పిన ఆడియో క్లిప్పులు బయటపడి ఈ విషయం పెద్ద రచ్చగా మారింది.బూతు పదజాలంతో కొన్ని ఆడియో క్లిప్‌లలో సంస్థ ప్రతినిధులు కస్టమర్లను తిడుతూ, బూతులతో, కస్టమర్ యొక్క కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అనరాని మాటలు అనడంతో, ఈ విషయం నెట్టింట చర్చగా మారింది, ప్రస్తుతం ఈ విషయమే ప్రజల ఆగ్రహానికి కారణమైంది.

ఈ ఆడియో క్లిప్‌లు వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వివాదం మీమర్స్ అందరికీ ఒక మంచి కంటెంట్ గా మారింది, ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఇదే ట్రెండింగ్ ఇష్యూగా మారింది.
చాలా మంది నెటిజన్లు అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క వ్యాపారం తాత్కాలికంగా ఆగిపోయినట్లే తెలుస్తుంది, వారి సంస్థ యొక్క వాట్సప్ అకౌంట్ డిలీట్ చేశారు.

ఈ విషయం పై తీవ్ర వివాదానికి దారితీస్తున్న సమయంలో, అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థ యొక్క నిర్వహకులు క్షమాపణలు తెలుపుతూ ఒక వీడియోను వారి యొక్క వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది.
ఈ విషయంపై ఆ వీడియోలో నిర్వాహకులు మాట్లాడుతూ తొలుత తమను కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని వాదించారు. అయితే, తరువాత అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వాహకులు అలేఖ్య స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి, తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పింది. ఆమె ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆ వీడియోలో కోరింది.

క్షమాపణ చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగలేదు. ఈ విషయంపై అనేక చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. కొందరు ఇది కావాలని చేస్తున్న ప్రచారం అని కూడా అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం అనేది సంస్థ ప్రతినిధుల దురుసు ప్రవర్తన మరియు బూతు పదజాలం కారణంగా తలెత్తి, సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది. క్షమాపణ చెప్పినప్పటికీ, ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది.

Tags: #ChittiPickels #AlekhyaaChittipickels #Newspulsetelugu #viralnews #trending #Aptrending #Tstrending

Spread the love
Continue Reading

Viral న్యూస్

అస్సలు HCU వివాదం ఏంటి…?

Published

on

News Pulse Telugu: Hyderbad Central University (HCU) లేదా University Of Hyderbad(UoH) దేశంలో పేరుగాంచిన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విశ్వవిద్యాలయం మరియు పరిశోధనలో ప్రాధాన్యత కలిగిన విద్యాసంస్థ.ఇది 1974లో 2300 ఎకరాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరా గాంధీ సహకారంతో స్థాపించబడింది. ఇది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలికి సమీపంగా ఉంది.

అస్సలు ప్రస్తుతం HCU వివాదం ఏంటి..?

ప్రస్తుతం ఎక్కడ, ఏ మాధ్యమాల్లో చూసిన ఈ వివాదం ప్రధానంగా కనిపిస్తుంది.
విద్యార్థుల ధర్నాలు, ప్రొటెస్ట్ లు ఇవ్వే కనిపిస్తున్నాయి.

అస్సలు ఈ వివాదం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించినది. ఈ భూమి HCU(Hyderabad Central University) పరిధిలోకి వస్తుందని విశ్వవిద్యాలయం వాదిస్తుండగా, ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అని, సర్వ హక్కులు ప్రభుత్వంకే ఉన్నాయని చెప్తూ, దీనిని అభివృద్ధి చేయాల నిప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం ఈ భూమిని వివిధ ప్రాజెక్టులకు కేటాయించాలని యోచిస్తోంది. అయితే, HCU విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

ఈ భూమిలో చెట్లను తొలగించడం, భూమిని చదును చేయడం వంటి పనులు చెయ్యడం నిలిపివేయాలని, ఈ HCU భూమిని ప్రభుత్వం విడిచి పెట్టాలని, మూగజీవలను ప్రకృతిని కాపాడాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

HCU కి సినీ సెలబ్రిటీల మద్దతు…!

ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరుగుతోంది.
ఈ వ్యవహారం పై సినీ సెలబ్రిటీలు రేణు దేశాయి, ఈశ రెబ్బ, రశ్మి గౌతమ్, ఇంకా ఇతరులు కూడా స్పందిస్తూ విద్యార్థులకు, పర్యావరణానికి మద్దతు తెలుపుతున్నారు.

HCU లో జరిగే తీవ్ర పరిణామలు ఇవ్వే...!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూములకు, హెచ్‌సీయూకు సంబంధంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
హెచ్‌సీయూ భూముల వివాదం రచ్చగా మారిన నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ వివాదంపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాయి.హెచ్‌సీయూ విద్యార్థినేతలు, నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక దశలో హెచ్‌సీయూ దగ్గర విద్యార్థుల పై పోలీసుల లాఠీచార్జి కూడా చోటుచేసుకుంది.

అయితే రాత్రికి రాత్రే.. ఫ్లడ్ లైట్ల వెలుతురుతో సుమారు 50 కి పైగా జేసీబీలతో అధికారులు నిర్వీరమం గా HCU భూములను చదును చేయడం వివాదాస్పదమైంది. ఈ వివాదం తెలంగాణలో రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.
అయితే, కంచ గచ్చిబౌలి HCU భూములపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. 400 ఎకరాల్లో చెట్లు నరికివేత చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
అదే సమయంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పందిస్తూ.. కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధారణ నివేదిక పంపాలని తెలంగాణ అటవీశాఖ అధికారులను ఆదేశించింది.
కోర్టు తీర్పులకు లోబడే అధికారులు ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని తెలిపింది.
నిజ నిర్ధారణ నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది తెలంగాణ హై కోర్ట్.

అసలు ప్రభుత్వం వాదన ఏంటి…?

ప్రభుత్వం HCU లోని 400 ఎకరాల ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని, యూనివర్సిటీకి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది.

HCU లోని ఈ భూమిని విక్రయం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి వాదన.
అయితే ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారని లేపాయి. అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకరం చుట్టిన ఈ ప్రభుత్వానికి, అడ్డుకట్ట వేయాలని కొన్ని దుష్టశక్తులు, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, కొన్ని గుంట నక్కలు ఈ పనులు చేస్తున్నాయని అసెంబ్లీ వేదికగా ఆయన అన్నారు.
ఈ వాక్యాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్రదుమారని లేపాయి.

ఈ వివాదం పై విద్యార్థుల వాదన….

HCU భూముల విక్రయం పట్ల విద్యార్థులు, ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. విద్యార్థులు తమ హక్కులను రక్షించుకోవాలని, ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో ఈ వివాదం ఉధృతంగా కొనసాగుతోంది.

అయితే అభివృద్ధి పేరుతో పచ్చని ప్రకృతిని వన్యప్రాణులను నాశనం చేయొద్దని, హైదరాబాద్ కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ప్రకృతి హైదరాబాద్ గుండె కాయని, ఈ ప్రకృతి ద్వారా ఎంతోమంది మానవాళికి ప్రాణవాయుని అందిస్తుందని, వారు వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను, కేవలం విద్యావ్యవస్థ కొరకై, యూనివర్సిటీ అభివృద్ధి కొరకి మాత్రమే ఉపయోగించాలని, వేరే ఇతర పనుల కోసం ఉపయోగించే హక్కు ఎవరికీ లేదని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే విద్య వ్యవస్థ అభివృద్ధి కొరకు ప్రభుత్వం పాటుపడితే, విద్యార్థులు ఎవరు అడ్డు చెప్పరని విద్యార్థులు అంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసులు తీవ్రంగా మోహరించారు, యూనివర్సిటీ కి సంబంధించిన అన్ని గేట్లను మూసివేసి, ప్రతి గేటు వద్ద పోలీసులు ఉన్నారు.
HCU వివాదం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో వేచి చూడాల్సిందే.

Spread the love
Continue Reading