స్పెషల్ ఆర్టికల్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలంతా ఎవరో తెలుసుకోండి..!
Published
2 years agoon

న్యూస్ పల్స్ తెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలంతా వీరే.. ఎవ్వరు ఏ నియోజకవర్గంలో తెలుసుకుందమా …!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది.అనుకోని ఉహించని రీతిలోBRS పార్టీని చిత్తూ చిత్తుగా ఓడించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఫలితంతో మొదలైన కాంగ్రెస్ గెలుపు ప్రయాణం .. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజయం ఢంకా మోగించుకుంటూ కొనసాగింది కాంగ్రెస్ పార్టీ.
119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోటిలో కాంగ్రెస్ పార్టీ 60 పై చిలుకు స్థానాల్లో విజయం సాధించి, మేజిక్ ఫిగర్ను అందుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను ఇప్పటికే కాంగ్రస్ గెలుచుకొని ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే విదంగా అడుగులు వేస్తుంది..
తెలంగాణ భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రావ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తొలి ఎమ్మెల్యే సీటు ఇదే. గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శించినప్పటికీ.. మిగతా జిల్లాల్లో మాత్రం హస్తం పార్టీ తన సత్తా చాటింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మె్ల్యే కేపీ వివేకానంద్ గౌడ్ అత్యధికంగా 85 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు .
ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలిచారో తెల్సుకుందాం ….! ( 2023 Telangana MLA”S List )
S.No . నియోజకవర్గం విజేత/ ఆధిక్యం పార్టీ
- సిర్పూర్,పాల్వాయి హరీష్ బాబు -బీజేపీ
- చెన్నూరు, గడ్డం వివేకానంద్- కాంగ్రెస్
- బెల్లంపల్లి, గడ్డం వినోద్ -కాంగ్రెస్
- మంచిర్యాల, కొక్కిరాల -ప్రేమ్ సాగర్ రావు(కాంగ్రెస్
- ఆసిఫాబాద్, కోవా లక్ష్మీ -బీజేపీ
- ఖానాపూర్, వెడ్మ భొజ్జు -కాంగ్రెస్
- ఆదిలాబాద్, పాయల్ శంకర్- బీజేపీ
- బోథ్ అనిల్, జాదవ్- బీఆర్ఎస్
- నిర్మల్,మహేశ్వర్ రెడ్డి -బీజేపీ
- ముథోల్, రామారావు పవార్ -బీజేపీ
- ఆర్మూర్, రాకేష్ రెడ్డి -బీజేపీ
- బోధన్,పి.సుదర్శన్ రెడ్డి -కాంగ్రెస్
- జుక్కల్, తోట లక్ష్మీకాంతరావు -కాంగ్రెస్
- బాన్సువాడ, పోచారం శ్రీనివాస రెడ్డి -బీఆర్ఎస్
- ఎల్లారెడ్డి, కె. మదన్ మోహన్ రావు -కాంగ్రెస్
- కామారెడ్డి,వెంకట రమణా రెడ్డి -కాంగ్రెస్
- నిజామాబాద్,అర్బన్ సూర్యనారాయణ -బీజేపీ
- నిజామాబాద్,రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి -కాంగ్రెస్
- బాల్కొండ, వేముల ప్రశాంత్ రెడ్డి -బీఆర్ఎస్
- కోరట్ల, కల్వకుంట్ల సంజయ్ -బీఆర్ఎస్
- జగిత్యాల, టి. జీవన్ రెడ్డి -కాంగ్రెస్
- ధర్మపురి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్- కాంగ్రెస్
- రామగుండం, మక్కన్ సింగ్ రాజ్ థాకూర్ -కాంగ్రెస్
- మంథని, దుద్దిళ్ల శ్రీధర్ బాబు -కాంగ్రెస్
- పెద్దపల్లి, చింతకుంట్ల వినయ రమణ రావు -కాంగ్రెస్
- కరీంనగర్, గంగుల కమలాకర్ -బీఆర్ఎస్
- చొప్పదండి, మేడిపల్లి సత్యం -కాంగ్రెస్
- వేములవాడ, ఆది శ్రీనివాస్ -కాంగ్రెస్
- సిరిసిల్ల, కేటీ రామారావు -బీఆర్ఎస్
- మానకొండూరు కె.సత్యనారాయణ -కాంగ్రెస్
- హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి -బీఆర్ఎస్
- హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ -కాంగ్రెస్
- సిద్ధిపేట టి. హరీశ్ రావు -బీఆర్ఎస్
- మెదక్ మైనంపల్లి రోహిత్ రావు -కాంగ్రెస్
- నారాయణ్ఖేడ్ పట్లోళ్ల సంజీవ రెడ్డి -కాంగ్రెస్
- ఆందోల్ దామోదర రాజనర్సింహ -బీఆర్ఎస్
- నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి -బీఆర్ఎస్
- జహీరాబాద్ కె.మాణిక్ రావు -బీఆర్ఎస్
- సంగారెడ్డి చింతా ప్రభాకర్ -బీఆర్ఎస్
- పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి -బీఆర్ఎస్
- దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి -బీఆర్ఎస్
- గజ్వేల్ కేసీఆర్ -బీఆర్ఎస్
- మేడ్చల్ చామకూర మల్లారెడ్డి -బీఆర్ఎస్
- మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి -బీఆర్ఎస్
- కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద్ -బీఆర్ఎస్
- కూకట్పల్లి మాధవరం కృష్ణారావు -బీఆర్ఎస్
- ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి -బీఆర్ఎస్
- ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి- కాంగ్రెస్
- ఎల్బీ నగర్ డి.సుధీర్ రెడ్డి- బీఆర్ఎస్
- మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి -బీఆర్ఎస్
- రాజేంద్రనగర్ టి.ప్రకాశ్ గౌడ్ -బీఆర్ఎస్
- శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ -బీఆర్ఎస్
- చేవెళ్ల కాలె యాదయ్య -బీఆర్ఎస్
- పరిగి తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి -కాంగ్రెస్
- వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ -కాంగ్రెస్
- తాండూరు బి.మనోహర్ రెడ్డి -కాంగ్రెస్
- ముషీరాబాద్ ముఠా గోపాల్ -బీఆర్ఎస్
- మలక్ పేట్ హ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా -ఎంఐఎం
- అంబర్పేట కాలేరు వెంకటేశ్ -బీఆర్ఎస్
- ఖైరతాబాద్ దానం నాగేందర్ -బీఆర్ఎస్
- జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ -బీఆర్ఎస్
- సనత్నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ -బీఆర్ఎస్
- నాంపల్లి మహ్మద్ మజీద్ హుస్సేన్ -ఎంఐఎం
- కార్వాన్ అమర్ సింగ్ -బీజేపీ
- గోషా మహల్ రాజాసింగ్ -బీజేపీ
- చార్మినార్ మిర్ జుల్ఫికర్ అలీ -ఎంఐఎం
- చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ -ఎంఐఎం
- యాకుత్పుర జాఫర్ హుస్సేన్ -ఎంఐఎం
- బహదూర్పుర మహ్మద్ ముబీన్ -ఎంఐఎం
- సికింద్రాబాద్ టి. పద్మారావు గౌడ్ -బీఆర్ఎస్
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్య నందిత సాయన్న -బీఆర్ఎస్
- కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి -కాంగ్రెస్
- నారాయణపేట చిట్టెం పర్ణికా రెడ్డి- కాంగ్రెస్
- మహబూబ్నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి -కాంగ్రెస్
- జడ్చర్ల అనిరుధ్ రెడ్డి -కాంగ్రెస్
- దేవరకద్ర ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి -బీఆర్ఎస్
- మక్తల్ వాకిటి శ్రీహరి- కాంగ్రెస్
- వనపర్తి తూడి మేఘారెడ్డి -కాంగ్రెస్
- గద్వాల కృష్ణ మోహన్ -బీఆర్ఎస్
- అలంపూర్ విజయుడు -బీఆర్ఎస్
- నాగర్కర్నూల్ డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి -కాంగ్రెస్
- అచ్చంపేట చిక్కడు వంశీ కృష్ణ -కాంగ్రెస్
- కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి -కాంగ్రెస్
- షాద్నగర్ కె.శంకరయ్య -కాంగ్రెస్
- కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు -కాంగ్రెస్
- దేవరకొండ నెనావత్ బాలూ నాయక్ -కాంగ్రెస్
- నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ -రెడ్డి కాంగ్రెస్
- మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి -కాంగ్రెస్
- హుజూర్నగర్ నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి-కాంగ్రెస్
- కోదాడ నలమడ పద్మావతి రెడ్డి-కాంగ్రెస్
- సూర్యాపేట జగదీశ్ రెడ్డి -బీఆర్ఎస్
- నల్గొండ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి -బీఆర్ఎస్
- మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి -కాంగ్రెస్
- భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి -కాంగ్రెస్
- నకిరేకల్ వేముల వీరేశం -కాంగ్రెస్
- తుంగతుర్తి మందుల శ్యాములు -కాంగ్రెస్
- ఆలేరు బీర్ల ఐలయ్య- కాంగ్రెస్
- జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి -బీఆర్ఎస్
- స్టేషన్ ఘన్పూర్ కడియం శ్రీహరి -బీఆర్ఎస్
- పాలకుర్తి మామిడాల యశస్విని -కాంగ్రెస్
- డోర్నకల్ జాటోత్ రామచందర్ నాయక్- కాంగ్రెస్
- మహబూబాబాద్ భుక్యా మురళీ నాయక్ -కాంగ్రెస్
- నర్సంపేట దొంతి మాధవరెడ్డి -కాంగ్రెస్
- పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి -కాంగ్రెస్
- వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి -కాంగ్రెస్
- వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ -కాంగ్రెస్
- వర్దన్నపేట కేఆర్ నాగరాజు -కాంగ్రెస్
- భూపాలపల్లి గండ్ర సత్యానారాయణరావు- కాంగ్రెస్
- ములుగు డి.అనసూయ (సీతక్క) -కాంగ్రెస్
- పినపాక పాయం వెంకటేశ్వర్లు -కాంగ్రెస్
- ఇల్లందు కోరం కనకయ్య -కాంగ్రెస్
- ఖమ్మం తుమ్మల నాగేశ్వర రావు- కాంగ్రెస్
- పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -కాంగ్రెస్
- మధిర మల్లు భట్టి విక్రమార్క -కాంగ్రెస్
- వైరా మాలోతు రామ్దాస్ -కాంగ్రెస్
- సత్తుపల్లి మట్టా రాగమయి -కాంగ్రెస్
- కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు- సీపీఐ
- అశ్వారావుపేట జారె ఆదినారాయణ -కాంగ్రెస్
- భద్రాచలం డాక్టర్ తెల్లం వెంకట్రావ్ -బీఆర్ఎస్.
You may like
Viral న్యూస్
Srirama Navami: శ్రీరామనవమి అస్సలు చరిత్ర ఇదే..
Published
4 months agoon
April 5, 2025
News Pulse Telugu: (Sri Ramanavami History)
శ్రీ రామనవమి చరిత్ర చాలా పురాతనమైనది, దేశవ్యాప్తంగా హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ శ్రీరామ నవమి. ఇది భగవాన్ శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమిగా భావించబడుతుంది.చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిది తేదీన పున్నమి నక్షత్రం సమయంలో రాముడు జన్మించాడు.ప్రతియేట ఈ శ్రీరామ నవమిని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
అస్సలు శ్రీ రామనవమి చరిత్ర…?
రాముడు త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు రాజ్యపాలన చేస్తున్న కాలంలో,దశరథ మహారాజు కు సంతానం లేకపోవడంతో యాగాలు చేస్తాడు. పుత్రకామేష్టి యాగం ఫలితంగా శ్రీమహావిష్ణువు నాలుగవ అవతారంగా రాముడిగా జన్మిస్తాడు.
దేవతలు రాక్షసుల అల్లర్ల వల్ల భూభారంగా వుండగా, విష్ణువును ప్రార్థించగా ఆయన రాముడిగా అవతరించాడని ఓ విశ్వాసం. రావణుని సంహారం కోసం ఈ అవతారం తీసుకున్నాడని పౌరాణిక విశ్వాసం.

శ్రీరామ నవమి పండుగ విధానం..?
శ్రీ రామ నవమి రోజు ఈ పండుగను పలుచోట్ల పలు రకాలుగా జరుపుకుంటారు, కొన్నిచోట్ల రాముడి జన్మకథ వినడం, రామాయణ పారాయణం చేస్తారు. ఎక్కువ శాతం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరాముని కళ్యాణోత్సవాలు(Sri Rama Kalyanam) అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ శ్రీరాముని కళ్యాణానికి భద్రాచలం చాలా ఫేమస్.
కొన్ని చోట్లల్లో ప్రజలు ఉపవాసం ఉంటారు, కొన్ని చోట్ల పానకమ్,జాగ్రతితో చేసిన తేనె లేదా బెల్లం నీరు, వడపప్పు, పులిహోర శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కనుక ఆలయాల్లో జరిగే కళ్యాణానికి హాజరై భక్తులందరికీ, చల్లటి మజ్జిగ, బెల్లం పానకం అందజేస్తారు.
శ్రీరాముని కళ్యాణోత్సవం ముగించిన తర్వాత, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథాలలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు.

శ్రీరామనవమి ఉత్సవ సందేశం..
ఈ పండుగ ధర్మం, సత్యం,నిజాయితీ, శాంతి, మర్యాదకు,నైతికతలను నెమలే రోజు అని చెబుతారు. శ్రీరాముని జీవితం హిందూ ధర్మంలో ఆదర్శంగా భావిస్తారు. శ్రీరాముడు తన జీవితంలో చూపిన విలువలు నేటికి ప్రజలు వారి జీవితాల్లో ఆదర్శంగా తీసుకుంటారు.
ఈ శ్రీరామనవమి ఉత్సవం కేవలం పండుగ కాకుండా, తెలుగువారి సంస్కృతిని మానవ విలువలను గుర్తుచేసే అద్భుతమైన పండుగని భావిస్తారు.

Tags: Sriramanavami, SitaRamachandraswamy, JaiSriram, NewspulseTelugu

News Pulse Telugu : Alekhyaa Chitti Pickles, ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం అవసరం లేదు, ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఎన్నో వివాదాలతో పేరు జోరుగా వినిపిస్తుంది.
అయితే ఈ విషయాన్ని, ఆ వివాదాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం…
Alekhyaa Chitti Pickles ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు అక్క చెల్లెలు కలిసి నిర్వహిస్తున్నారు. వారు వివిధ రకాల పికిల్స్ను తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఈ యొక్క వ్యాపారానికి ముందు ఈ ముగ్గురు అక్క చెల్లెలు, సోషల్ మీడియా వేదికగా, ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లలో పలు వీడియోలను చిత్రీకరిస్తూ, మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.
యొక్క సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫేమ్ ని, వారి యొక్క వ్యాపారాన్ని ఉపయోగించుకుంటూ పచ్చళ్ల విక్రయాన్ని కొనసాగించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

అయితే, కొందరు వినియోగదారులు వారి నాణ్యత మరియు ధరల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మార్కెట్ ప్రకారం చూసుకున్న, మార్కెట్లో ఉన్న ధరలకు రెండింతలుగా వీరి యొక్క పికిల్స్ ధరలతో విక్రయస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
ఆ పికిల్స్ ని కొన్న వినియోగదారులు కూడా వారి యొక్క పికిల్స్ కు సంతృప్తి చెందడం లేదు, వారు నిర్ణయించిన ధరకు, పికిల్స్ రుచి, నాణ్యత అంతగా లేకపోవడం వినియోగదారులను తీవ్ర నిరాశకు తరచూ గురిచేస్తుందని చాలామంది వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా వారికి నేరుగా తెలుపుతున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో అలేఖ్య చిట్టి పికిల్స్కు సంబంధించిన కొన్ని వివాదాలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా నడుస్తున్నాయి.

అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క వివాదం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఆడియో క్లిప్ల చుట్టూ తిరుగుతోంది. ఈ క్లిప్లలో, అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థకు చెందిన వ్యక్తి కస్టమర్లతో దురుసుగా, అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆడియోలో కస్టమర్లతో సంస్థ ప్రతినిధులు మాట్లాడినట్లుగా ఉన్న అనేక ఆడియో క్లిప్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వీటిలో కొందరు కస్టమర్లు ధరల గురించి లేదా ఇతర సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు దురుసుగా సమాధానం చెప్పిన ఆడియో క్లిప్పులు బయటపడి ఈ విషయం పెద్ద రచ్చగా మారింది.బూతు పదజాలంతో కొన్ని ఆడియో క్లిప్లలో సంస్థ ప్రతినిధులు కస్టమర్లను తిడుతూ, బూతులతో, కస్టమర్ యొక్క కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అనరాని మాటలు అనడంతో, ఈ విషయం నెట్టింట చర్చగా మారింది, ప్రస్తుతం ఈ విషయమే ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
ఈ ఆడియో క్లిప్లు వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వివాదం మీమర్స్ అందరికీ ఒక మంచి కంటెంట్ గా మారింది, ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఇదే ట్రెండింగ్ ఇష్యూగా మారింది.
చాలా మంది నెటిజన్లు అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క వ్యాపారం తాత్కాలికంగా ఆగిపోయినట్లే తెలుస్తుంది, వారి సంస్థ యొక్క వాట్సప్ అకౌంట్ డిలీట్ చేశారు.

ఈ విషయం పై తీవ్ర వివాదానికి దారితీస్తున్న సమయంలో, అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థ యొక్క నిర్వహకులు క్షమాపణలు తెలుపుతూ ఒక వీడియోను వారి యొక్క వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది.
ఈ విషయంపై ఆ వీడియోలో నిర్వాహకులు మాట్లాడుతూ తొలుత తమను కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని వాదించారు. అయితే, తరువాత అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వాహకులు అలేఖ్య స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి, తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పింది. ఆమె ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆ వీడియోలో కోరింది.
క్షమాపణ చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగలేదు. ఈ విషయంపై అనేక చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. కొందరు ఇది కావాలని చేస్తున్న ప్రచారం అని కూడా అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం అనేది సంస్థ ప్రతినిధుల దురుసు ప్రవర్తన మరియు బూతు పదజాలం కారణంగా తలెత్తి, సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది. క్షమాపణ చెప్పినప్పటికీ, ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది.
Tags: #ChittiPickels #AlekhyaaChittipickels #Newspulsetelugu #viralnews #trending #Aptrending #Tstrending

News Pulse Telugu: Hyderbad Central University (HCU) లేదా University Of Hyderbad(UoH) దేశంలో పేరుగాంచిన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విశ్వవిద్యాలయం మరియు పరిశోధనలో ప్రాధాన్యత కలిగిన విద్యాసంస్థ.ఇది 1974లో 2300 ఎకరాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరా గాంధీ సహకారంతో స్థాపించబడింది. ఇది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలికి సమీపంగా ఉంది.
అస్సలు ప్రస్తుతం HCU వివాదం ఏంటి..?
ప్రస్తుతం ఎక్కడ, ఏ మాధ్యమాల్లో చూసిన ఈ వివాదం ప్రధానంగా కనిపిస్తుంది.
విద్యార్థుల ధర్నాలు, ప్రొటెస్ట్ లు ఇవ్వే కనిపిస్తున్నాయి.
అస్సలు ఈ వివాదం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించినది. ఈ భూమి HCU(Hyderabad Central University) పరిధిలోకి వస్తుందని విశ్వవిద్యాలయం వాదిస్తుండగా, ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అని, సర్వ హక్కులు ప్రభుత్వంకే ఉన్నాయని చెప్తూ, దీనిని అభివృద్ధి చేయాల నిప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం ఈ భూమిని వివిధ ప్రాజెక్టులకు కేటాయించాలని యోచిస్తోంది. అయితే, HCU విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

ఈ భూమిలో చెట్లను తొలగించడం, భూమిని చదును చేయడం వంటి పనులు చెయ్యడం నిలిపివేయాలని, ఈ HCU భూమిని ప్రభుత్వం విడిచి పెట్టాలని, మూగజీవలను ప్రకృతిని కాపాడాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
HCU కి సినీ సెలబ్రిటీల మద్దతు…!
ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరుగుతోంది.
ఈ వ్యవహారం పై సినీ సెలబ్రిటీలు రేణు దేశాయి, ఈశ రెబ్బ, రశ్మి గౌతమ్, ఇంకా ఇతరులు కూడా స్పందిస్తూ విద్యార్థులకు, పర్యావరణానికి మద్దతు తెలుపుతున్నారు.
HCU లో జరిగే తీవ్ర పరిణామలు ఇవ్వే...!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూములకు, హెచ్సీయూకు సంబంధంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
హెచ్సీయూ భూముల వివాదం రచ్చగా మారిన నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ వివాదంపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాయి.హెచ్సీయూ విద్యార్థినేతలు, నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక దశలో హెచ్సీయూ దగ్గర విద్యార్థుల పై పోలీసుల లాఠీచార్జి కూడా చోటుచేసుకుంది.

అయితే రాత్రికి రాత్రే.. ఫ్లడ్ లైట్ల వెలుతురుతో సుమారు 50 కి పైగా జేసీబీలతో అధికారులు నిర్వీరమం గా HCU భూములను చదును చేయడం వివాదాస్పదమైంది. ఈ వివాదం తెలంగాణలో రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.
అయితే, కంచ గచ్చిబౌలి HCU భూములపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. 400 ఎకరాల్లో చెట్లు నరికివేత చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
అదే సమయంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పందిస్తూ.. కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధారణ నివేదిక పంపాలని తెలంగాణ అటవీశాఖ అధికారులను ఆదేశించింది.
కోర్టు తీర్పులకు లోబడే అధికారులు ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని తెలిపింది.
నిజ నిర్ధారణ నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది తెలంగాణ హై కోర్ట్.
అసలు ప్రభుత్వం వాదన ఏంటి…?
ప్రభుత్వం HCU లోని 400 ఎకరాల ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని, యూనివర్సిటీకి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది.
HCU లోని ఈ భూమిని విక్రయం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి వాదన.
అయితే ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారని లేపాయి. అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకరం చుట్టిన ఈ ప్రభుత్వానికి, అడ్డుకట్ట వేయాలని కొన్ని దుష్టశక్తులు, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, కొన్ని గుంట నక్కలు ఈ పనులు చేస్తున్నాయని అసెంబ్లీ వేదికగా ఆయన అన్నారు.
ఈ వాక్యాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్రదుమారని లేపాయి.
ఈ వివాదం పై విద్యార్థుల వాదన….
HCU భూముల విక్రయం పట్ల విద్యార్థులు, ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. విద్యార్థులు తమ హక్కులను రక్షించుకోవాలని, ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో ఈ వివాదం ఉధృతంగా కొనసాగుతోంది.
అయితే అభివృద్ధి పేరుతో పచ్చని ప్రకృతిని వన్యప్రాణులను నాశనం చేయొద్దని, హైదరాబాద్ కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ప్రకృతి హైదరాబాద్ గుండె కాయని, ఈ ప్రకృతి ద్వారా ఎంతోమంది మానవాళికి ప్రాణవాయుని అందిస్తుందని, వారు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను, కేవలం విద్యావ్యవస్థ కొరకై, యూనివర్సిటీ అభివృద్ధి కొరకి మాత్రమే ఉపయోగించాలని, వేరే ఇతర పనుల కోసం ఉపయోగించే హక్కు ఎవరికీ లేదని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే విద్య వ్యవస్థ అభివృద్ధి కొరకు ప్రభుత్వం పాటుపడితే, విద్యార్థులు ఎవరు అడ్డు చెప్పరని విద్యార్థులు అంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసులు తీవ్రంగా మోహరించారు, యూనివర్సిటీ కి సంబంధించిన అన్ని గేట్లను మూసివేసి, ప్రతి గేటు వద్ద పోలీసులు ఉన్నారు.
HCU వివాదం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో వేచి చూడాల్సిందే.

యువతిపై రైల్వేస్టేషన్ వద్ద కీచకుల అఘాయిత్యం…

Peddi: పెద్ది సినిమా కథ ఇదే….

Srirama Navami: శ్రీరామనవమి అస్సలు చరిత్ర ఇదే..

దసరా రోజున రావణ దహనం ఎందుకు చేస్తారు…?(Why is Ravana burnt on Dussehra..?)

ప్రియుడి మొజులో బర్తని హత్య చేసిన భార్య
