న్యూస్పల్స్తెలుగు : దాదాపు గత సంవత్సర కాలంగా ప్రతి ఒక్కరు తమ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని Income Tax అధికారులు చెప్తూనే ఉన్నారు. వారు చెప్పిన చాలా వరకు ప్రజలు పాన్ కార్డు మరియు ఆధార్ కార్డులను లింక్ చేసుకోక పోవడంతో 3సార్లు గడువుని కూడా పొడిగించారు. తర్వాత మళ్ళీ పొడిగించి ఫైన్ తో ఈ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింకింగ్ కార్యక్రమం ని కొనసాగించారు.
గురువారం 11.5కోట్ల ఆధార్ తో పాన్ లింక్ కానీ పాన్ కార్డులను రద్దు చేసినట్లు సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్స్ స్ (CBDT) వెల్లడించింది. భారతదేశంలో 57.25 కోట్ల మంది తమ ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేసారని సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్స్ స్ (CBDT) తెలిపింది. ఇప్పుడు రద్దు చేయబడిన పాన్ కార్డులను మళ్ళీ ఆక్టివేట్ చేసుకోవాలంటే, ప్రతి ఒక్కరు తమ కార్డుకు 1000/- రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్స్ స్ (CBDT) తెలిపింది. ఈ విషయాలన్నీ ఓ RTI పై వచ్చిన అభ్యర్తన పై ఈ విషయాలన్నీ తెలిపింది CBDT.
అస్సలు పాన్ కార్డు తో ఆధార్ లింక్ చేయకపోతే ఏమౌంతుంది?
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏ ప్రకారం పాన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఆధార్ నంబర్ తో పాన్ కార్డు జత చెయ్యాలి. ఒకవేళ చెయ్యకపోతే పాన్ కార్డు పని చేయకుండా పోయి సెక్షన్ 114ఏఏ ప్రకారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం…
పాన్ కార్డు పని చేయకుండా పోతే ట్యాక్స్ రీఫండ్ వంటి సేవలు ఆగిపోతాయి. ట్యాక్స్ మినహాయింపులు మరియు ఇతర సేవలు పొందేందుకు ఉన్న నిబంధనలు ఏవి కూడా వారికి వర్తించవు.
రీఫండ్ అయ్యే నగదుపై ఎలాంటి వడ్డీని ఆదాయపు పన్ను శాఖ వీరికీ చెల్లించదు.
సెక్షన్ 114ఏఏఏలోని సబ్ రూల్ (4) ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పాన్ కార్డు పని చేయకుండా పోయిన రోజు నుంచి మళ్లీ తిరిగి ఆక్టివ్ అయ్యే రోజు వరకు ఎలాంటి వడ్డీ వీరికి రాదు.
పాన్ కార్డు పని చేయని వ్యక్తిపై ట్యాక్స్ చాప్టర్ xvjj-B కింద డిడక్ట్ అవుతుంది. సెక్షన్ 206ఏఏ ప్రకారం ఆ ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. xvvjj-B కింద వసూలు చేసే సెక్షన్ 206సీసీ పరిధిలోకి వస్తుంది. దీని వళ్ళ ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ డిడక్ట్ అవకాశాలు ఉన్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్(CBDT) ప్రకారం పైన పేర్కొన్న పరిణామాలు లింక్ చెయ్యని,మరియు కార్డు రద్దు అయ్యిన వారికీ వర్తిస్తాయి.
ప్రకారం పాన్ కార్డు పని చేయకుండా పోయిన రోజు నుంచి మళ్లీ పని ఆపరేటివ్గా మారిన రోజు వరకు ఎలాంటి వడ్డీ రాదు.
అలాగే పాన్ కార్డు ఎప్పటి వరకు పని చేయకుండా ఉందొ అప్పటి వరకు అవే రూల్స్ అమలులో ఉంటాయి. అప్పటి వరకు పాన్ కార్డును అల్లి తిరిగి అక్టివ్ చేసేందుకు ఆధార్ నంబర్ జత చేసేందుకు 1000 రూపాయల పెనాల్టి చెల్లించే నిబంధన సైతం అమలులోనే ఉంటుంది. సెక్షన్ 139AA లోని సబ్ సెక్షన్ (3) ప్రకారం ఎవరికైతే పాన్ ఆధార్ లింక్ నుంచి మినహాయింపు ఉంటుందో వారిపై పాన్ పని చేయకుండా పోతే ఎదురయ్యే పరిణామాలు వారికి వర్తించవు.
News Pulse Telugu,మేడ్చల్: ఆడపిల్లలకు ప్రస్తుతం ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు ఎన్ని ప్రత్యక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట తరుచు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్స్టేషన్ లిమిట్స్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కానీ యువతి మాత్రం భయపడిపోకుండా తనను తాను రక్షించుకునేందుకు ఆ దుర్మార్గ కీచకులతో పోరాడింది.
ఇటీవలే జరిగిన ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార ఘటన మరువక ముందే మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అయితే యువతి వారికీ బయపడకుండా వారికీ ప్రతిఘటించడంతో అక్కడ నుంచి వారు పరుగులు తీశారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండుగా ఆమెను ఈ కీచకులు అడ్డుకున్నారు . ఆ యువతిని బలవంతం చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా, అస్సలే అధైర్య పడకుండా వారితో ధైర్యంగా పోరాడింది. ఆ కామాంధుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది ఆ యువతి. ఒక్కసారిగా దుండగులందరూ ఆ యువతి మీదకు రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో యువతి దాడి చేసి తప్పించునేందుకు ప్రయత్నించింది.
అయినప్పటికీ ఆ దుండగులు యువతి వెంటపడటంతో తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది యువతి. చివరకు ఆ దుండగుల భారి నుంచి ఎలాగోలా తప్పించుకుని యువతి వెంటనే మేడ్చల్ పోలీస్స్టేషన్కు చేరుకుంది. పోలీస్ స్టేషన్ లో దుండుగులు ఏ విధంగా తనను ఇబ్బందులకు గురిచేశారు.. తాను ఎలా తప్పించుకుందో పోలీసులకు వివరంగా వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును మేడ్చెల్ పోలీసులు, రైల్వే పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.
ఈ మధ్య కాలంలో ఆ రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ పలు మార్లు ఫిర్యాదులు రైల్వే పోలీసులకు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది దుండగులు గంజాయి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని,గంజాయి మత్తులో ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పోలీసులు భద్రత పెంచాలంటూ పలు డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్లో జరిగిన ఘటనపై పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జీఆర్పీ పోలీసులకు ఈ కేసును బదిలీ చేయగా.. వారు కేసును విచారణ జరుపుతున్నారు.
కీచకులతో ప్రతిఘటిస్తున్న సమయంలో ఆ యువతికి కూడా కొంత మేరకు గాయాలు అవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
News Pulse Telugu:మెగా ఫ్యామిలీ వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) నటిస్తున్న తాజా సినిమా “పెద్ది”( Peddi) ఈ సినిమా వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ , సుకుమార్ రైటింగ్స్ ద్వారా తెరకెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు, బుచ్చిబాబు సానా,సంగీతం ఏ.ఆర్. రెహమాన్ (Bucchi Babu Sana, A.R Rehaman) అందిస్తున్నారు.
Peddi Film: Bucchi Babu Sana, A.R Rehaman
నటీనటులు రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ చిత్రంలో కనిపించునున్నారు.
“పెద్ది సినిమా”(Peddi Film) ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించారు.
సినిమా ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఒక గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ ఆడుతూ కనిపించారు.
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ద్విపాత్ర నటులుగా నటించిన గేమ్ చేంజర్,సినిమా దాదాపు 450కోట్ల బడ్జెట్ తో తెరకేక్కిన చిత్రం వారు ఉహించిన ఫలితాలు రాకుండా, అటు ప్రేక్షకులను కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది.
అయితే ప్రముఖ దర్శకులు సుకుమార్ యొక్క శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రానికి అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవలే భారీ బడ్జెట్ తో విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించక పోయిన కారణంగా, గ్లోబల్ స్టార్ కూడా ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ పెద్ది సినిమా మార్చ్27, 2026 లో తెలుగు, హిందీ, తమిళ్,కనడ, భాషల్లో విడుదల కానుంది.
శ్రీ రామనవమి చరిత్ర చాలా పురాతనమైనది, దేశవ్యాప్తంగా హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ శ్రీరామ నవమి. ఇది భగవాన్ శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమిగా భావించబడుతుంది.చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిది తేదీన పున్నమి నక్షత్రం సమయంలో రాముడు జన్మించాడు.ప్రతియేట ఈ శ్రీరామ నవమిని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
అస్సలు శ్రీ రామనవమి చరిత్ర…?
రాముడు త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు రాజ్యపాలన చేస్తున్న కాలంలో,దశరథ మహారాజు కు సంతానం లేకపోవడంతో యాగాలు చేస్తాడు. పుత్రకామేష్టి యాగం ఫలితంగా శ్రీమహావిష్ణువు నాలుగవ అవతారంగా రాముడిగా జన్మిస్తాడు.
దేవతలు రాక్షసుల అల్లర్ల వల్ల భూభారంగా వుండగా, విష్ణువును ప్రార్థించగా ఆయన రాముడిగా అవతరించాడని ఓ విశ్వాసం. రావణుని సంహారం కోసం ఈ అవతారం తీసుకున్నాడని పౌరాణిక విశ్వాసం.
శ్రీరామ నవమి పండుగ విధానం..?
శ్రీ రామ నవమి రోజు ఈ పండుగను పలుచోట్ల పలు రకాలుగా జరుపుకుంటారు, కొన్నిచోట్ల రాముడి జన్మకథ వినడం, రామాయణ పారాయణం చేస్తారు. ఎక్కువ శాతం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరాముని కళ్యాణోత్సవాలు(Sri Rama Kalyanam) అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ శ్రీరాముని కళ్యాణానికి భద్రాచలం చాలా ఫేమస్. కొన్ని చోట్లల్లో ప్రజలు ఉపవాసం ఉంటారు, కొన్ని చోట్ల పానకమ్,జాగ్రతితో చేసిన తేనె లేదా బెల్లం నీరు, వడపప్పు, పులిహోర శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కనుక ఆలయాల్లో జరిగే కళ్యాణానికి హాజరై భక్తులందరికీ, చల్లటి మజ్జిగ, బెల్లం పానకం అందజేస్తారు. శ్రీరాముని కళ్యాణోత్సవం ముగించిన తర్వాత, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథాలలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు.
శ్రీరామనవమి ఉత్సవ సందేశం..
ఈ పండుగ ధర్మం, సత్యం,నిజాయితీ, శాంతి, మర్యాదకు,నైతికతలను నెమలే రోజు అని చెబుతారు. శ్రీరాముని జీవితం హిందూ ధర్మంలో ఆదర్శంగా భావిస్తారు. శ్రీరాముడు తన జీవితంలో చూపిన విలువలు నేటికి ప్రజలు వారి జీవితాల్లో ఆదర్శంగా తీసుకుంటారు. ఈ శ్రీరామనవమి ఉత్సవం కేవలం పండుగ కాకుండా, తెలుగువారి సంస్కృతిని మానవ విలువలను గుర్తుచేసే అద్భుతమైన పండుగని భావిస్తారు.