న్యూస్పల్స్తెలుగు: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ కోసం అధిష్టానం కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా, మరో 19 స్థానాలకు క్యాండిడేట్లను ఫైనల్ చేయాల్సి ఉన్నది.
ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎంలకు పార్టీలకు ఇచ్చే స్థానాలు కూడా ఖరారు కావాల్సి ఉన్నాయి. ఈ పార్టీలూ చేరి రెండు సీట్లను కోరుకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి ఏ మాత్రం ఇంకా స్పష్టతకు రాలేదు. కానీ కచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఒక స్థానమైనా తమకు ఉండాలని సీపీఎం పట్టుబాటుతున్న, దానిపైనే లోతుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను కొలిక్కి తేవడానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ బాధ్యతలను అప్పజెప్పడంతో, సీపీఎం రాష్ట్ర కార్యదర్శితో ఆయన సమావేశాలు కొనసాగుతున్నాయి.
సీపీఎం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం లేదా వైరా లేదా ఇల్లెందు స్థానాలను కోరుతున్నది. కానీ పార్టీ ఈక్వేషన్ ప్రకారం ఈ మూడింటిలో దేన్ని కూడా ఈ పార్టీలకు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మిర్యాలగూడ స్థానాన్ని కోరుతున్నందున దాన్ని కేటాయించడానికి కాంగ్రెస్ ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు.
కచ్చితంగా ఖమ్మం జిల్లాలో రెండో స్థానాన్ని ఇవ్వాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈ క్రమంలో కేంద్ర కమిటీ తరఫున సీతారాం ఏచూరి కూడా రంగంలోకి దిగారు. రెండు లెఫ్ట్ పార్టీలు చెరొక స్థానంతో సరిపెట్టుకోవాలని, మరో స్థానాన్ని ఎమ్మెల్సీ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. కానీ దీనిపై రెండు లెఫ్ట్ పార్టీలూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతున్నది.
సీపీఐ విషయంలో ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తుంది. మరో స్థానంగా చెన్నూరును సీపీఐ కోరుకున్నది. దీన్ని ఇవ్వడానికి తొలుత కాంగ్రెస్ సమ్మతించినా.. రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో త్వరలో కాంగ్రెస్లో చేరనున్న ఒకరికి కేటాయించాలని ఆలోచిస్తున్నట్లు వినికిడి.
ఈ పార్టీతోనూ సీట్ల సర్దుబాటులో ఇబ్బంది ఉన్నందున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నారు. తొందర్లోనే కొలిక్కి వచ్చే అవకాశమున్నది. దీనిపై క్లారిటీ వస్తే వెంటనే కాంగ్రెస్ తన 15 మంది అభ్యర్థులతో ఫైనల్ లిస్టును రిలీజ్ చేయాలనుకుంటున్నది. ఒకవేళ లెఫ్ట్ పార్టీల నిర్ణయం ఒక రోజు ఆలస్యమైతే బుధవారానికి తుది జాబితాను ప్రకటించాలని హైకమాండ్ భావిస్తున్నది.
సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ ఫైనల్ లిస్టు రిలీజ్ ప్రక్రియలో జాప్యం నెలకొన్నది. వామపక్షాలతో పొత్తు చెడిపోకుండా కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే పొత్తు చెడిపోతుందని, రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ పొలిటికల్గా మైలేజ్ పొందడంతో పాటు ఓట్ల చీలికతో కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని ఏఐసీసీ నేతలు అనుమానిస్తున్నారు.
లెప్ట్ పార్టీలు పొత్తులో లేకుండా స్వతంత్రంగా నిలబడితే కొన్ని సెగ్మెంట్లలో స్వల్పంగానైనా ఓట్లు డైవర్ట్ అవుతాయని, అది ప్రత్యర్థి పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందేమోననే డౌట్తో పొత్తు చెడిపోకుండా చూసుకునేలా కాంగ్రెస్ ఆలోచిస్తున్నది.
రెండు లెఫ్ట్ పార్టీలు కచ్చితంగా రెండు సీట్ల కోసం పట్టుబడితే సీపీఎంకు వైరా, మిర్యాలగూడ స్థానాలను, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది…
News Pulse Telugu,మేడ్చల్: ఆడపిల్లలకు ప్రస్తుతం ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు ఎన్ని ప్రత్యక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట తరుచు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్స్టేషన్ లిమిట్స్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కానీ యువతి మాత్రం భయపడిపోకుండా తనను తాను రక్షించుకునేందుకు ఆ దుర్మార్గ కీచకులతో పోరాడింది.
ఇటీవలే జరిగిన ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార ఘటన మరువక ముందే మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అయితే యువతి వారికీ బయపడకుండా వారికీ ప్రతిఘటించడంతో అక్కడ నుంచి వారు పరుగులు తీశారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండుగా ఆమెను ఈ కీచకులు అడ్డుకున్నారు . ఆ యువతిని బలవంతం చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా, అస్సలే అధైర్య పడకుండా వారితో ధైర్యంగా పోరాడింది. ఆ కామాంధుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది ఆ యువతి. ఒక్కసారిగా దుండగులందరూ ఆ యువతి మీదకు రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో యువతి దాడి చేసి తప్పించునేందుకు ప్రయత్నించింది.
అయినప్పటికీ ఆ దుండగులు యువతి వెంటపడటంతో తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది యువతి. చివరకు ఆ దుండగుల భారి నుంచి ఎలాగోలా తప్పించుకుని యువతి వెంటనే మేడ్చల్ పోలీస్స్టేషన్కు చేరుకుంది. పోలీస్ స్టేషన్ లో దుండుగులు ఏ విధంగా తనను ఇబ్బందులకు గురిచేశారు.. తాను ఎలా తప్పించుకుందో పోలీసులకు వివరంగా వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును మేడ్చెల్ పోలీసులు, రైల్వే పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.
ఈ మధ్య కాలంలో ఆ రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ పలు మార్లు ఫిర్యాదులు రైల్వే పోలీసులకు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది దుండగులు గంజాయి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని,గంజాయి మత్తులో ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పోలీసులు భద్రత పెంచాలంటూ పలు డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్లో జరిగిన ఘటనపై పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జీఆర్పీ పోలీసులకు ఈ కేసును బదిలీ చేయగా.. వారు కేసును విచారణ జరుపుతున్నారు.
కీచకులతో ప్రతిఘటిస్తున్న సమయంలో ఆ యువతికి కూడా కొంత మేరకు గాయాలు అవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
News Pulse Telugu:మెగా ఫ్యామిలీ వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) నటిస్తున్న తాజా సినిమా “పెద్ది”( Peddi) ఈ సినిమా వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ , సుకుమార్ రైటింగ్స్ ద్వారా తెరకెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు, బుచ్చిబాబు సానా,సంగీతం ఏ.ఆర్. రెహమాన్ (Bucchi Babu Sana, A.R Rehaman) అందిస్తున్నారు.
Peddi Film: Bucchi Babu Sana, A.R Rehaman
నటీనటులు రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ చిత్రంలో కనిపించునున్నారు.
“పెద్ది సినిమా”(Peddi Film) ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించారు.
సినిమా ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఒక గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ ఆడుతూ కనిపించారు.
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ద్విపాత్ర నటులుగా నటించిన గేమ్ చేంజర్,సినిమా దాదాపు 450కోట్ల బడ్జెట్ తో తెరకేక్కిన చిత్రం వారు ఉహించిన ఫలితాలు రాకుండా, అటు ప్రేక్షకులను కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది.
అయితే ప్రముఖ దర్శకులు సుకుమార్ యొక్క శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రానికి అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవలే భారీ బడ్జెట్ తో విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించక పోయిన కారణంగా, గ్లోబల్ స్టార్ కూడా ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ పెద్ది సినిమా మార్చ్27, 2026 లో తెలుగు, హిందీ, తమిళ్,కనడ, భాషల్లో విడుదల కానుంది.
శ్రీ రామనవమి చరిత్ర చాలా పురాతనమైనది, దేశవ్యాప్తంగా హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ శ్రీరామ నవమి. ఇది భగవాన్ శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమిగా భావించబడుతుంది.చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిది తేదీన పున్నమి నక్షత్రం సమయంలో రాముడు జన్మించాడు.ప్రతియేట ఈ శ్రీరామ నవమిని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
అస్సలు శ్రీ రామనవమి చరిత్ర…?
రాముడు త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు రాజ్యపాలన చేస్తున్న కాలంలో,దశరథ మహారాజు కు సంతానం లేకపోవడంతో యాగాలు చేస్తాడు. పుత్రకామేష్టి యాగం ఫలితంగా శ్రీమహావిష్ణువు నాలుగవ అవతారంగా రాముడిగా జన్మిస్తాడు.
దేవతలు రాక్షసుల అల్లర్ల వల్ల భూభారంగా వుండగా, విష్ణువును ప్రార్థించగా ఆయన రాముడిగా అవతరించాడని ఓ విశ్వాసం. రావణుని సంహారం కోసం ఈ అవతారం తీసుకున్నాడని పౌరాణిక విశ్వాసం.
శ్రీరామ నవమి పండుగ విధానం..?
శ్రీ రామ నవమి రోజు ఈ పండుగను పలుచోట్ల పలు రకాలుగా జరుపుకుంటారు, కొన్నిచోట్ల రాముడి జన్మకథ వినడం, రామాయణ పారాయణం చేస్తారు. ఎక్కువ శాతం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరాముని కళ్యాణోత్సవాలు(Sri Rama Kalyanam) అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ శ్రీరాముని కళ్యాణానికి భద్రాచలం చాలా ఫేమస్. కొన్ని చోట్లల్లో ప్రజలు ఉపవాసం ఉంటారు, కొన్ని చోట్ల పానకమ్,జాగ్రతితో చేసిన తేనె లేదా బెల్లం నీరు, వడపప్పు, పులిహోర శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కనుక ఆలయాల్లో జరిగే కళ్యాణానికి హాజరై భక్తులందరికీ, చల్లటి మజ్జిగ, బెల్లం పానకం అందజేస్తారు. శ్రీరాముని కళ్యాణోత్సవం ముగించిన తర్వాత, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథాలలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు.
శ్రీరామనవమి ఉత్సవ సందేశం..
ఈ పండుగ ధర్మం, సత్యం,నిజాయితీ, శాంతి, మర్యాదకు,నైతికతలను నెమలే రోజు అని చెబుతారు. శ్రీరాముని జీవితం హిందూ ధర్మంలో ఆదర్శంగా భావిస్తారు. శ్రీరాముడు తన జీవితంలో చూపిన విలువలు నేటికి ప్రజలు వారి జీవితాల్లో ఆదర్శంగా తీసుకుంటారు. ఈ శ్రీరామనవమి ఉత్సవం కేవలం పండుగ కాకుండా, తెలుగువారి సంస్కృతిని మానవ విలువలను గుర్తుచేసే అద్భుతమైన పండుగని భావిస్తారు.