న్యూస్పల్స్తెలుగు, పెద్దపల్లి జిల్లా: రాను రాను మానవత్వం మంటకలిసి పోతుంది, ఈనెల 29-10 -2023 రోజు రాత్రి రామగుండం పరిధి లో జరిగిన హత్య కేసు నిందితులను 48 గంటలు తిరక్కముందే రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏ సీ పీ తుల శ్రీనివాస్ రావు విలేకరుల సమావేశంలో తెలిపారు. మాల్యాలపల్లి సబ్ స్టేషన్ కి సమీపంలో తేదీ 29-10-23 రోజున రాత్రి సమయంలో మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడనే సమాచారం మేరకు రామగుండం ఎస్ ఐ వెంకటేష్ , సి ఐ, చంద్ర శేఖర్ గౌడ్, ఏ సీ పీ తుల శ్రీనివాస్ రావు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి ఆనవాళ్ళ కోసం ప్రయత్నం చేసారు. చనిపోయిన వ్యక్తి పేరు లావుడియ మధుకర్,s/o నాన్యా నాయక్(30), గా గుర్తించారు. పోతన కాలనీ,8 incline కాలనీ నివసిగా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేయగా నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడిని అతడి భార్య లావుడియా రమ తన అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని తన ప్రియుడు గోవర్ధన్ మరో ఇద్దరితో కలసి పథకం ప్రకారం హత్య చేసినారని తెలిసింది.
పోలీసులసమాచారంప్రకారంసంఘటననేపథ్యం..
మృతుడు లావుడియ మధుకర్ సింగరేణి ఉద్యోగం చేస్తూ పోతన కాలనీ, 8 ఇంక్లైన్ కాలనీ గోదావరిఖని ఉంటున్నాడు. మృతుడి భార్య లావుడియా అలియాస్ నునసవత్ రమకి ఒక పెళ్లి సంబంధం విషయంలో ధరావత్ గోవర్ధన్ అనునతడితో పరిచయం అయి వారి పరిచయ అక్రమ సంబంధం గా మారింది. గోవర్ధన్ తరచు మృతుడి ఇంటికి వస్తూ పోతూ మరియు మృతుడి భార్య తో ఫోన్లో మాట్లాడుకోవడం ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడే రెండు మూడు రోజులు ఉండేవాడు, అది చూసి మృతుడికి అతడి భార్య పై అనుమానం రావడం తో అతడిని చంపేయాలని తర్వాత ఎటువంటి అడ్డు ఉండదు అని నిందితురాలు మృతుని భార్య ఇచ్చిన సలహా మేరకు ప్రియుడు గోవర్ధన్ కూడా సరే అని ఒప్పుకున్నాడు. నిందితుడు గోవర్ధన్ మృతుడు మధుకర్ ని బయటకు ఎటు అయిన తీసుకు వెళ్ళి మందు తాగిచ్చి చంపి ఎవ్వరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదం లా చనిపోయినట్లు చిత్రీకరిస్తే నీకు కూడా ఉద్యోగం వస్తది అని పథకం వేసుకొన్నారు.
పోలీసులసమాచారంప్రకారంసంఘటనజరిగినతీరు….
తేదీ 29 10 2023 నాడు మృతుడు ఉదయం యధావిధిగా డ్యూటీ కి పోయి తిరిగి మధ్యాహ్నం కాలుకు దెబ్బ తగిలిందని వచ్చి భోజనం చేసి మధ్యాహ్నం మూడు గంటలకు మళ్ళీ డ్యూటీ కి పోయి సుమారు మూడున్నర గంటలకు ఇంటికి వచ్చినడు. సాయంత్రమే గోవర్దన్ అతడి స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్ లతో కలసి నాచారం నుండి మధుకర్ ను చంపాలనే ఉద్దేశ్యం తో ఒక ఇనుప రాడ్ నాగరాజు యొక్క హీరో గ్లామర్ బైక్ ఫూట్రెస్ట్ వద్ద కనబడ కుండ కట్టుకొని గోదావరిఖని కి వచ్చి, రాత్రి 07:00 గంటలకు గోవర్ధన్ నిండుతురాలు రమకి ఫోన్ చేసి మృతుడి తో మాట్లాడి బయటకి రమ్మని చెప్పగా మృతుడు మధుకర్ తన పల్సర్ బైక్ పై రావడం తో అందరూ గోదావరిఖని 5 ఇంక్లైన్ వద్ద కలసుకొని అక్కడ రాజా రాణి వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసి అందరూ కలసి మాల్యాలపల్లి సబ్ స్టేషన్ వద్ద u టర్న్ తీసుకొని మంచిర్యాల వెళ్ళే రోడ్డు వైపుకి కొద్ది దూరం వచ్చి రోడ్డు పక్కన మోటార్ సైకిళ్ళు అపి చెట్లల్లో తాగుతుండగా గోవర్ధన్ ముందుగానే మోటార్ సైకిలు కి కట్టుకున్న ఇనుప రాడ్ ని తీసుకుని మృతుడికి కనబడకుండా అతడి వెనుక కనబడకుండా పెట్టి అనతరం గోవర్ధన్ అతడి ఫ్రెండ్స్ నాగరాజు, లక్ష్మన్ లు కలిసి ఇనుపరాడళతో తలపై కొట్టి చంపిన, తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో పడేసి అతని పల్సర్ బైక్ డామేజ్ చేసి, స్టార్ట్ చేసి అతని మీదకు వదిలి పెడితే అది పక్కకు పడినది, ఈ విషయం గోవర్ధన్, మృతుడి భర్య రమకి వాట్స్ అప్ ద్వారా ఫోన్ చేసి చెప్పి అనంతరం నిందితులంతా మోటార్ సైకిల్ పై పరార్ అయ్యారు.
నిందితురాలు రమ మృతుడి తల్లిదండ్రులకి బంధువులకి తన భర్త రోడ్డు ప్రమాదంలోనే చనిపోయినాడు అని అనుకునేలా నమ్మబలికినది.
నిందితులుపట్టుబడినవిధానం..
మృతుడి తల్లిదండ్రులు, సోదరులు మృతుడి భార్య రమ నే తన భర్తని హత్య చేయించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరిపి మృతుడి హత్యలో అతడి భార్య రమ తో పాటు మరో ముగ్గురు పాత్ర కూడా ఉందని బయటపడడం తో నిందితులందరిని అదుపులోకి తీసుకొని విచారించగ వారు చేసిన నేరం అంగీకరించారు.
News Pulse Telugu,మేడ్చల్: ఆడపిల్లలకు ప్రస్తుతం ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు ఎన్ని ప్రత్యక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట తరుచు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్స్టేషన్ లిమిట్స్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కానీ యువతి మాత్రం భయపడిపోకుండా తనను తాను రక్షించుకునేందుకు ఆ దుర్మార్గ కీచకులతో పోరాడింది.
ఇటీవలే జరిగిన ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార ఘటన మరువక ముందే మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అయితే యువతి వారికీ బయపడకుండా వారికీ ప్రతిఘటించడంతో అక్కడ నుంచి వారు పరుగులు తీశారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండుగా ఆమెను ఈ కీచకులు అడ్డుకున్నారు . ఆ యువతిని బలవంతం చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా, అస్సలే అధైర్య పడకుండా వారితో ధైర్యంగా పోరాడింది. ఆ కామాంధుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది ఆ యువతి. ఒక్కసారిగా దుండగులందరూ ఆ యువతి మీదకు రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో యువతి దాడి చేసి తప్పించునేందుకు ప్రయత్నించింది.
అయినప్పటికీ ఆ దుండగులు యువతి వెంటపడటంతో తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది యువతి. చివరకు ఆ దుండగుల భారి నుంచి ఎలాగోలా తప్పించుకుని యువతి వెంటనే మేడ్చల్ పోలీస్స్టేషన్కు చేరుకుంది. పోలీస్ స్టేషన్ లో దుండుగులు ఏ విధంగా తనను ఇబ్బందులకు గురిచేశారు.. తాను ఎలా తప్పించుకుందో పోలీసులకు వివరంగా వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును మేడ్చెల్ పోలీసులు, రైల్వే పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.
ఈ మధ్య కాలంలో ఆ రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ పలు మార్లు ఫిర్యాదులు రైల్వే పోలీసులకు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది దుండగులు గంజాయి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని,గంజాయి మత్తులో ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పోలీసులు భద్రత పెంచాలంటూ పలు డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్లో జరిగిన ఘటనపై పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జీఆర్పీ పోలీసులకు ఈ కేసును బదిలీ చేయగా.. వారు కేసును విచారణ జరుపుతున్నారు.
కీచకులతో ప్రతిఘటిస్తున్న సమయంలో ఆ యువతికి కూడా కొంత మేరకు గాయాలు అవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
న్యూస్ పల్స్ తెలుగు,మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో కల్మలాపేట గ్రామనికి చెందిన సల్పలా శ్రీనివాస్ కు బెల్లంపల్లి కోర్టు జడ్జి ముకేశ్ మూడు నెలల జెలు శిక్ష విధించినట్లు నీల్వయి ఏస్ఐ సుబ్బారావు తెలిపారు మూడు నెలల క్రితం కల్మలాపేటలో రాజేందర్ ఇంట్లో ఎవరూలేని సమయం లో దొంగతనం జరిగింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేసి సల్పలా శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు నేరం రుజువు కావడంతో జడ్జి మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
న్యూస్ పల్స్ తెలుగు : చిన్న వయసులో ప్రేమ వివాహం అయ్యి, గర్భం దాల్చడంతో, రక్త హీనతతో యువతి మృతి చెందింది …అది తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సాయితరుణ్ (22) ఇదే గ్రామానికి చెందిన జ్యోతిక ఇరువురు ప్రేమించుకోగా కులాలు వేరు కావడంతో వారి తల్లిదండ్రులు,పెద్దలు అంగీకరించడకపోవడంతో వారిని ఎదురించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు ఈ ఇద్దరు దంపతులు.
కాగా జ్యోతిక గర్బిణి అయ్యి,నెల కిందట రక్తహీనత వ్యాదితో ఆసుపత్రిలో జ్యోతిక మృతి చెందింది.తీవ్ర మనస్థాపానికి గురైన భర్త సాయి తరుణ్ వారం రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు సాయి తరుణ్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం సాయి తరుణ్ ని హైదరాబాద్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నస్పూర్ మున్సిపాలిటీకి పరిధిలోని సీసీసీలో నివాసం ఉంటుండగా మృతదేహాన్ని స్వగ్రామమైన శెట్టిపల్లికి వారి తల్లిదండ్రులు బంధువులు తరలించారు.