Madaram Jatara 2024:న్యూస్ పల్స్ తెలుగు: తెలంగాణలో రెండు సంవత్సరాలకు ఒక్కసారి, మాఘ శుద్ధ పౌర్ణమి వేళలో ఎంతో ప్రతిష్టమ్మకంగా జరిగే మేడారం మహా జాతర ఎంతో విశిష్టమైనది. ప్రపంచవ్యప్తంగా ప్రఖ్యాతిగాంచిన జాతరే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. నేటి నుండి నాలుగు రోజులపాటు సాగుతుంది ఈ జాతర. ఒక్కోరోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మొత్తం మారు మ్రోగిపోతుంది. అశేషామైన భక్త జనవాహిని మధ్య,భావోద్వేగ సమ్మేళనం మధ్య, సారలమ్మను ఇవాళ మేడారంలో గద్దె మీద ప్రతిష్టిస్తారు.(Medaram Sarakka -2024) అత్యంత రహస్యంగా కోయ పూజారులు పూజలు చేశాక.. కన్నేపల్లి నుండి జై సారలమ్మ.. జైజై సారలమ్మ అంటూ,జన సద్రోహం మధ్య జై జైలు కొడుతూ సారలమ్మ తల్లి ప్రతిష్టాపన జరుగుతుంది.
సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో జరిగే ప్రతి ఘట్టానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు బుధవారం రోజును, వన దేవతల వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు.. ఈరోజు మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకార కార్యక్రమం జరుగుతుంది. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జాతర ఘన లాంఛనంగా మొదలవుతుంది. ఈ మేడారం మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలను మండమెలిగె అనే పేరుతో పిలుస్తారు. మండమెలిగె పూజ కార్యక్రమం పూర్తయితే జాతర మొదలైనట్లేనని అక్కడి ఆదివాసీలు భావిస్తారు. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లల్లో పండుగ రోజులు ప్రారంభం అవ్వడంతో బంధువులు వారి ఇంటికి వస్తారు. ఈ మేడారం మహా జాతర ఇవాళ్టి నుండి ఈ నెల 24 వరకు జరుగుతుంది.
మేడారం మహా జాతర విశేషాలు:
ఈ మేడారం మహా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మేడారం మహా జాతరకు ప్రతి యేటా కోట్లాది సంఖ్యలోభక్తులు హాజరు అవుతుంటారు. ఈ యేటా ఇంకా మరింత సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ మేడారం మహా జాతరలో ప్రధానంగా ఈ నాలుగు రోజులు, నాలుగు ఘట్టాలు ఉంటాయి. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో ఈ మేడారం మహా జాతర ఊపందుకుంటుంది. సారలమ్మను ఈరోజు సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. సారలమ్మ జాతర గద్దె పైకి రాకముందే ఏటూరునాగారం మండలం, కొండాయి నుంచి గోవిందరాజును, అలాగే మహబూబాబాద్ జిల్లా, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడక ద్వారా మేడారం తీసుకొచ్చి జాతర గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. జాతర సందర్భంగా సమ్మక్క, పగిడిద్దరాజులకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం కోయ పూజారులు వివాహం జరిపిస్తారు. ఈ మేడారం మహా జాతరకు ఒక రోజు ముందు అంటే మంగళవారం పగిడిద్దరాజును ఆయన స్వస్థలమైన పూనుగొండ్లలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా తయారుచేసి వేడుకను నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం వరకు వడ్డె ఇంటి నుంచి పసుపు, కుంకుమ, కొత్త బట్టలతో పగిడిద్దరాజును మేడారం ఆలయానికి చేరుకుంటారు. బయల్దేరే ముందు యాటను బలిచ్చి, ఆదివాసీ సంప్రదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
నిన్న (మంగళవారం) రాత్రి తాడ్వాయి మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుని అక్కడ పెనక వంశీయుల ఇంటి వద్ద బస చేసిన పగిడిద్దరాజు ఇవాళ సాయంత్రం గద్దెలపై ప్రతిష్టించబడతారు.
ఈ మేడారం జాతరలో,నాలుగు రోజులే కీలకమైనవి: బుధవారం జాతర ప్రారంభం అవుతుంది. మొదటిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ జాతర గద్దెపైకి చేరుతుంది. రాత్రి పూనుగొండ్ల నుంచి మేడారానికి చేరుకున్న పగిడిద్ద రాజును, కొండాయి నుంచి గోవిందరాజును,గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభం అవుతుంది.
రెండో రోజు గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెలపైకి చేరటంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది.
మూడో రోజు శుక్రవారం, ఈ రోజే ప్రత్యమైన రోజు,గిరిజనుల ఆరాధ్యదైవాలైన సారలమ్మ, సమ్మక్కలు జాతర గద్దెపైకి చేరటంతో శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా, తండుపతండాలుగా తరలివస్తారు.
నాలుగో రోజు శనివారం గద్దెలపై ఉన్న తల్లులను మొక్కులు అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తిరుగు పయనం అవుతారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.
మేడారం మహాజాతరకు వచ్చే భక్తులంతా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ వాగులోనే పుణ్యస్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది.
ఇసుక వేస్తే రాలనంతగా జనంతో జంపన్నవాగు ప్రయాగ్రాజ్లోని గంగ, యమున నదుల్లో జరిగే కుంభమేళాను తలపిస్తుంది. దీంతో ఈ మేడారం మహా జాతర తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతరను పిలుస్తున్నారు.
News Pulse Telugu,మేడ్చల్: ఆడపిల్లలకు ప్రస్తుతం ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు ఎన్ని ప్రత్యక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట తరుచు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్స్టేషన్ లిమిట్స్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కానీ యువతి మాత్రం భయపడిపోకుండా తనను తాను రక్షించుకునేందుకు ఆ దుర్మార్గ కీచకులతో పోరాడింది.
ఇటీవలే జరిగిన ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార ఘటన మరువక ముందే మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అయితే యువతి వారికీ బయపడకుండా వారికీ ప్రతిఘటించడంతో అక్కడ నుంచి వారు పరుగులు తీశారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండుగా ఆమెను ఈ కీచకులు అడ్డుకున్నారు . ఆ యువతిని బలవంతం చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా, అస్సలే అధైర్య పడకుండా వారితో ధైర్యంగా పోరాడింది. ఆ కామాంధుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది ఆ యువతి. ఒక్కసారిగా దుండగులందరూ ఆ యువతి మీదకు రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో యువతి దాడి చేసి తప్పించునేందుకు ప్రయత్నించింది.
అయినప్పటికీ ఆ దుండగులు యువతి వెంటపడటంతో తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది యువతి. చివరకు ఆ దుండగుల భారి నుంచి ఎలాగోలా తప్పించుకుని యువతి వెంటనే మేడ్చల్ పోలీస్స్టేషన్కు చేరుకుంది. పోలీస్ స్టేషన్ లో దుండుగులు ఏ విధంగా తనను ఇబ్బందులకు గురిచేశారు.. తాను ఎలా తప్పించుకుందో పోలీసులకు వివరంగా వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును మేడ్చెల్ పోలీసులు, రైల్వే పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.
ఈ మధ్య కాలంలో ఆ రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ పలు మార్లు ఫిర్యాదులు రైల్వే పోలీసులకు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది దుండగులు గంజాయి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని,గంజాయి మత్తులో ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పోలీసులు భద్రత పెంచాలంటూ పలు డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్లో జరిగిన ఘటనపై పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జీఆర్పీ పోలీసులకు ఈ కేసును బదిలీ చేయగా.. వారు కేసును విచారణ జరుపుతున్నారు.
కీచకులతో ప్రతిఘటిస్తున్న సమయంలో ఆ యువతికి కూడా కొంత మేరకు గాయాలు అవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
News Pulse Telugu:మెగా ఫ్యామిలీ వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) నటిస్తున్న తాజా సినిమా “పెద్ది”( Peddi) ఈ సినిమా వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ , సుకుమార్ రైటింగ్స్ ద్వారా తెరకెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు, బుచ్చిబాబు సానా,సంగీతం ఏ.ఆర్. రెహమాన్ (Bucchi Babu Sana, A.R Rehaman) అందిస్తున్నారు.
Peddi Film: Bucchi Babu Sana, A.R Rehaman
నటీనటులు రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ చిత్రంలో కనిపించునున్నారు.
“పెద్ది సినిమా”(Peddi Film) ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించారు.
సినిమా ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఒక గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ ఆడుతూ కనిపించారు.
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ద్విపాత్ర నటులుగా నటించిన గేమ్ చేంజర్,సినిమా దాదాపు 450కోట్ల బడ్జెట్ తో తెరకేక్కిన చిత్రం వారు ఉహించిన ఫలితాలు రాకుండా, అటు ప్రేక్షకులను కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది.
అయితే ప్రముఖ దర్శకులు సుకుమార్ యొక్క శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రానికి అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవలే భారీ బడ్జెట్ తో విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించక పోయిన కారణంగా, గ్లోబల్ స్టార్ కూడా ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ పెద్ది సినిమా మార్చ్27, 2026 లో తెలుగు, హిందీ, తమిళ్,కనడ, భాషల్లో విడుదల కానుంది.
శ్రీ రామనవమి చరిత్ర చాలా పురాతనమైనది, దేశవ్యాప్తంగా హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ శ్రీరామ నవమి. ఇది భగవాన్ శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమిగా భావించబడుతుంది.చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిది తేదీన పున్నమి నక్షత్రం సమయంలో రాముడు జన్మించాడు.ప్రతియేట ఈ శ్రీరామ నవమిని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
అస్సలు శ్రీ రామనవమి చరిత్ర…?
రాముడు త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు రాజ్యపాలన చేస్తున్న కాలంలో,దశరథ మహారాజు కు సంతానం లేకపోవడంతో యాగాలు చేస్తాడు. పుత్రకామేష్టి యాగం ఫలితంగా శ్రీమహావిష్ణువు నాలుగవ అవతారంగా రాముడిగా జన్మిస్తాడు.
దేవతలు రాక్షసుల అల్లర్ల వల్ల భూభారంగా వుండగా, విష్ణువును ప్రార్థించగా ఆయన రాముడిగా అవతరించాడని ఓ విశ్వాసం. రావణుని సంహారం కోసం ఈ అవతారం తీసుకున్నాడని పౌరాణిక విశ్వాసం.
శ్రీరామ నవమి పండుగ విధానం..?
శ్రీ రామ నవమి రోజు ఈ పండుగను పలుచోట్ల పలు రకాలుగా జరుపుకుంటారు, కొన్నిచోట్ల రాముడి జన్మకథ వినడం, రామాయణ పారాయణం చేస్తారు. ఎక్కువ శాతం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరాముని కళ్యాణోత్సవాలు(Sri Rama Kalyanam) అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ శ్రీరాముని కళ్యాణానికి భద్రాచలం చాలా ఫేమస్. కొన్ని చోట్లల్లో ప్రజలు ఉపవాసం ఉంటారు, కొన్ని చోట్ల పానకమ్,జాగ్రతితో చేసిన తేనె లేదా బెల్లం నీరు, వడపప్పు, పులిహోర శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కనుక ఆలయాల్లో జరిగే కళ్యాణానికి హాజరై భక్తులందరికీ, చల్లటి మజ్జిగ, బెల్లం పానకం అందజేస్తారు. శ్రీరాముని కళ్యాణోత్సవం ముగించిన తర్వాత, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథాలలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు.
శ్రీరామనవమి ఉత్సవ సందేశం..
ఈ పండుగ ధర్మం, సత్యం,నిజాయితీ, శాంతి, మర్యాదకు,నైతికతలను నెమలే రోజు అని చెబుతారు. శ్రీరాముని జీవితం హిందూ ధర్మంలో ఆదర్శంగా భావిస్తారు. శ్రీరాముడు తన జీవితంలో చూపిన విలువలు నేటికి ప్రజలు వారి జీవితాల్లో ఆదర్శంగా తీసుకుంటారు. ఈ శ్రీరామనవమి ఉత్సవం కేవలం పండుగ కాకుండా, తెలుగువారి సంస్కృతిని మానవ విలువలను గుర్తుచేసే అద్భుతమైన పండుగని భావిస్తారు.